ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- ఆదిలాబాద్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులను పట్టుకోవడంలో తెలంగాణ అనిశా (ACB) మరోసారి సక్సెస్ అయింది. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి సంబంధించిన రూ. 2 కోట్ల బిల్లును మంజూరు చేసేందుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్ ఫిర్యాదుదారుడిని లంచం కోసం డిమాండ్ చేశాడు. మొదట రూ. 2 లక్షల లంచం కోరిన శంకర్, ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని రూ. 1 లక్షకు తగ్గించాడు. అనంతరం మొదటి విడతగా రూ. 50,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అనుమానం వచ్చినప్పుడల్లా “1064” నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు

  • Related Posts

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన…

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్ జె.పి దర్గా ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీ ఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : తెలంగాణ సంస్కృతికి, మతసామరస్యానికి రంజాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్