ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- ఆదిలాబాద్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులను పట్టుకోవడంలో తెలంగాణ అనిశా (ACB) మరోసారి సక్సెస్ అయింది. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి సంబంధించిన రూ. 2 కోట్ల బిల్లును మంజూరు చేసేందుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్ ఫిర్యాదుదారుడిని లంచం కోసం డిమాండ్ చేశాడు. మొదట రూ. 2 లక్షల లంచం కోరిన శంకర్, ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని రూ. 1 లక్షకు తగ్గించాడు. అనంతరం మొదటి విడతగా రూ. 50,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అనుమానం వచ్చినప్పుడల్లా "1064" నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు