సొరంగంలో కూరుకుపోయిన మృతదేహం గుర్తింపు

మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 09 – టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఫిబ్రవరి 22న ప్రమాదం జరగ్గా.. అందులో 8 మంది చిక్కుకుపోయారు. టన్నెల్‌లో గల్లంతైన వారిని గుర్తించడంలో తాజాగా కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ కేడవర్ డాగ్స్ స్క్వాడ్ గుర్తించినట్లు తెలిసింది. TBM మెషీన్ ఎడమ పక్కన ఓ మృత దేహానికి సంబంధించిన చేయి కనిపించినట్లు తెలిసింది.GPR, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం ప్రస్తుతం తవ్వకాలు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగి స్తున్నారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయి ఉన్నట్లు తెలిసింది. డ్రిల్లింగ్ ద్వారానే శరీరాలను బయటికి తీసేందుకు సాధ్యమవు తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందాలు పాల్గొన్నాయి గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. అయితే ఆనవాళ్లు లభించడాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరి గంటల్లో పూర్తి స్థాయి సమాచారం రానుంది

  • Related Posts

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా…

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్(18)కు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)కు మధ్య సామాజిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్