సవితమ్మ శభాష్!

సవితమ్మ శభాష్!

మానవత్వం చాటుకున్న మంత్రి సవితపై ప్రశంసలు

పెనుకొండ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. తీవ్రంగా గాయపడి బాధతో విలవిలాడుతూ, రోడ్డుపై నిస్సహాయంగా పడివున్న వ్యక్తిని గుర్తించి తన ఎస్కార్ వాహనంలో ఆసుపత్రికి పంపించారు. అక్కడితో తన పని అయిపోయిందని భావించకుండా, బాధ్యయుతమైన నాయకురాలిగా స్పందిస్తూ, ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేశారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. మంత్రి సవిత స్పందించిన తీరును చూసి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన పెనుకొండ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పట్టణంలో ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైన మంత్రి సవిత తన స్వగ్రహానికి పయనమయ్యారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కు రాగానే, రోడ్డుపై యాక్సిండ్ గురైన వ్యక్తి నిస్సహాయంగా పడిఉండడాన్ని మంత్రి గమనించారు. తక్షణమే తన కాన్వాయ్ ను ఆపి, క్షతగాత్రుడిని పరిశీలించారు. తీవ్ర గాయం కావడంతో విలవిలలాడుతున్న బాధితుడిని తన ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి, స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులకు ఫోన్ చేసి, క్షతగాత్రుడికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలపాలని స్పష్టం చేశారు. మంత్రి సవిత ఆగమేఘాలపై స్పందించిన తీరును చూసి పెనుకొండ వాసులు అభినందించారు. గతంలోనూ పలు ప్రమాద సంఘటనలో మంత్రి స్పందించిన తీరును గుర్తు చేసుకుంటూ, ప్రశంసలు కురిపించారు.

  • Related Posts

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరఫున నారా…

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు