ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- ఆదిలాబాద్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులను పట్టుకోవడంలో తెలంగాణ అనిశా (ACB) మరోసారి సక్సెస్ అయింది. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి సంబంధించిన రూ. 2 కోట్ల బిల్లును మంజూరు చేసేందుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్ ఫిర్యాదుదారుడిని లంచం కోసం డిమాండ్ చేశాడు. మొదట రూ. 2 లక్షల లంచం కోరిన శంకర్, ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని రూ. 1 లక్షకు తగ్గించాడు. అనంతరం మొదటి విడతగా రూ. 50,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అనుమానం వచ్చినప్పుడల్లా “1064” నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు

  • Related Posts

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్‌లో ఉన్న వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో గురువారం ముందస్తు హోలీ పండుగ వేడుకలు…

    అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు – తహసీల్దార్ లింగం మూర్తి మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 13 – అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ లింగం మూర్తి స్పష్టం చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం