KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

KCR | హైదరాబాద్ : రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్‌దే అని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. ‘గోదావరి కన్నీటి గోస’ పేరుతో గోదావరి నది నుంచి కొండపోచమ్మసాగర్‌ వరకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర నిర్వహించి.. ఇవాళ మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో కోరుకంటి చందర్ పాదయాత్ర బృందంతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయి. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంది. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టనున్న రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌దే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని కేసీఆర్ సూచించారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు. ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి. తెలంగాణని ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది అని కేసీఆర్ ధ్వజమెత్తారు

  • Related Posts

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం 2025 క్యాలెండర్‌ను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు శనివారం ఆవిష్కరించారు. షాద్‌నగర్…

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!

    Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం.

    Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం.

    Ugadi 2025: మార్చి 30 తెలుగు సంవత్సరాది.. ఉగాది పచ్చడి తినేందుకు ముహూర్తం ఇదే..!

    Ugadi 2025: మార్చి 30 తెలుగు సంవత్సరాది.. ఉగాది పచ్చడి తినేందుకు ముహూర్తం ఇదే..!

    Ramadan: రేపే రంజాన్‌..

    Ramadan: రేపే రంజాన్‌..