వ్యాపారస్తులు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి

వ్యాపారస్తులు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి

ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 12 :- వ్యాపారస్తులు విధిగా ఫుడ్ లైసెన్స్ ను తీసుకోవాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముధోల్ లోని కిరాణా షాపులను విస్తృతంగా తనిఖీ చేశారు. వ్యాపారస్తులు విక్రయిస్తున్న వస్తువులను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు సైతం దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తయారు తేదీతో పాటు కాలం తీరిన తేదీలను సరి చూసుకోవాలని అన్నారు. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులకు రసీదులను సైతం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారస్తులు సైతం దుకాణాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతి ఇవ్వాలని ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫుడ్ లైసెన్స్ ను తీసుకొని వ్యాపారస్తులు కచ్చితంగా తీసుకోవాలని పేర్కొన్నారు. దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట సిబ్బంది, తదితరులు ఉన్నారు

  • Related Posts

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చిస్తున్న సమయం లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వాఖ్యలకు నిరసన గా కడెం కాంగ్రెస్ పార్టీ…

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు కనికరం లేని కాంగ్రెస్ సర్కారుపై కర్షకుడి కన్నెర్ర నీళ్లు ఇవ్వకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరిక రైతు ధర్నాకు మద్దతుగా బిఆర్ఎస్ ధర్నాకు బయలు దేరినా సుంకె రవిశంకర్ హౌస్ అరెస్టు చేసిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ