వేసవిలో రైతులకు సాగునీరు అందిస్తాం

వేసవిలో రైతులకు సాగునీరు అందిస్తాం

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- వేసవిలో రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కడెం మండలం కొత్తమద్దిపడగ గ్రామ శివారు పంట పొలాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన పంటలకు సంబంధించి వివరాలను రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులు సాగు చేసిన పంటలకు కడెం ప్రాజెక్టు సదర్మాట్ కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు అవసరమైన మేరకు నీటిని అందిస్తామని తెలిపారు. సాగునీటి విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రతి పంట పొలానికి ఏప్రిల్ చివరినాటికీ సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, నీటిపారుదల శాఖ ఈఈ విట్టల్, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు కనికరం లేని కాంగ్రెస్ సర్కారుపై కర్షకుడి కన్నెర్ర నీళ్లు ఇవ్వకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరిక రైతు ధర్నాకు మద్దతుగా బిఆర్ఎస్ ధర్నాకు బయలు దేరినా సుంకె రవిశంకర్ హౌస్ అరెస్టు చేసిన…

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో ఉన్న విద్యా భారతి పాఠశాలలో గురువారం ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. విద్యార్థులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!