రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు

   రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హాజరయ్యారు. గ్రామంలో శోభయాత్రలో పాల్గొని ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. గ్రామంలో పెద్ద మొత్తంలో భక్తులు శ్రీరామ మాలాధారణ వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు

  • Related Posts

    TTDకి రూ. కోటి విరాళం

    TTDకి రూ. కోటి విరాళం మనోరంజని ప్రతినిధి తిరుపతి ఏప్రిల్ 07 – తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు మొత్తం…

    భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

    భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నభద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం భద్రాచలం రామాలయంలో శ్రీ రామ మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరవుతున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు

    దేశ వ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు

    సీఎం రేవంత్‌పై బాల్క సుమన్ ఆగ్రహం

    సీఎం రేవంత్‌పై బాల్క సుమన్ ఆగ్రహం

    భారత యువతకు బిల్‌ గేట్స్‌ సలహా ఇదే!

    భారత యువతకు బిల్‌ గేట్స్‌ సలహా ఇదే!

    గాల్లో ప్రయాణికురాలు మృతి.. విమానం అత్యవసర ల్యాండింగ్

    గాల్లో ప్రయాణికురాలు మృతి.. విమానం అత్యవసర ల్యాండింగ్