

రబింద్ర పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం
అలరించిన విద్యార్థుల డ్యాన్సులు


మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 08 :- నిర్మల్ జిల్లా ముధోల్.మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యా ర్థులు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.ఈ వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనోరమ చారిట బుల్ ట్రస్ట్ చైర్మన్, డాక్టర్ నాగేష్, ప్రభుత్వ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యా యురాలు వందన, బోసి నాగేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యా యులు అమూ ల్యమైన విషయాలను అందించారన్నారు. జీవితంలో 10వ తరగతిలో మరచిపోని స్నేహితులు ఉంటారని గుర్తుకు చేశారు. దీంతో వీడ్కోలు సమావేశం సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్యా లు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పదవ తరగతి విద్యార్థులు పాఠశాలలో ఉన్న అనుబంధాలను విద్యార్థిని, విద్యార్థులు పంచుకున్నారు. విద్యార్థులు పాఠశాల మేనేజ్మెంట్, ఉపాధ్యాయులను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాం డెంట్ రాజేందర్, డైరెక్టర్,చైర్మన్ పోతన్న యాదవ్ ,భీమ్ రావు దేశాయి తో పాటు ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు