ముస్తఫానగర్ పాఠశాలలో త్రాగునీటి ఫిల్టర్ వితరణ

ముస్తఫానగర్ పాఠశాలలో త్రాగునీటి ఫిల్టర్ వితరణ

మనోరంజని ప్రతినిధి రాజన్న సిరిసిల్ల మార్చి 12 :-రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముస్తఫానగర్ గ్రామ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య భద్రతకు శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు చాయ్ దునియా మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ బండ గారు త్రాగునీటి ఫిల్టర్ వితరణ చేశారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామ ప్రజలు మరియు పాఠశాల యాజమాన్యం త్రాగునీటి సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వితరణ చేయాలని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుతూ త్రాగునీటి ఫిల్టర్‌ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు వెంటనే శుద్ధమైన నీటిని అందించారు. సుదర్శన్ బండ గారి సేవా కార్యక్రమాన్ని గుర్తించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు మండల విద్యాధికారి ఆయనను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందనలు తెలిపారు. గ్రామ ప్రజలు, పాఠశాల అధికారులు ఆయన సేవా స్పృహను ప్రశంసించారు

  • Related Posts

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు కనికరం లేని కాంగ్రెస్ సర్కారుపై కర్షకుడి కన్నెర్ర నీళ్లు ఇవ్వకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరిక రైతు ధర్నాకు మద్దతుగా బిఆర్ఎస్ ధర్నాకు బయలు దేరినా సుంకె రవిశంకర్ హౌస్ అరెస్టు చేసిన…

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో ఉన్న విద్యా భారతి పాఠశాలలో గురువారం ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. విద్యార్థులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!