మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

కారు స్వాధీనం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 20 :- ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కార్‌ పాస్‌ స్టిక్కర్‌ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు స్టిక్కర్‌ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్‌(MLA Sticker)ను ఆమెకు, సిబ్బందికి తెలియకుండా వేరే వ్యక్తి తన వాహనానికి అతికించుకుని తిరుగుతున్నాడు. దీనిపై రెండురోజుల క్రితం మంత్రి పీఆర్‌ఓ పాండునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు వాహన యజమాని వివరాలు తెలుసుకున్నారు. యజమానికి ఫోన్‌ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

  • Related Posts

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ అన్నారు. నిన్న హైదరాబాదులో ట్రైన్ లో నుండి ఓ…

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత. *మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఆంతరంగిక చైతన్యానికి ఉపయోగపడే యోగ ధ్యాన కార్యక్రమాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అందాల పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్

    అందాల పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్

    వచ్చే నెలలో ముహూర్తాల జాతర

    వచ్చే నెలలో ముహూర్తాల జాతర

    సాయం అందించే చేతులకు వేదిక పీ4

    సాయం అందించే చేతులకు వేదిక పీ4

    నటుడు, పవన్ కళ్యాణ్ గురువు మృతి

    నటుడు, పవన్ కళ్యాణ్ గురువు మృతి