

బేటి బచావో బేటి పడావో ప్రాముఖ్యతపై డిగ్రీ విద్యార్థినులతో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఇంటరాక్షన్



మనోరంజని ప్రతినిధి నిర్మల్, మార్చి 03 :- బేటి బచావో బేటి పడావో కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దీని ప్రాముఖ్యతను విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, అదనపు కలెక్టర్ విద్యార్థినులతో ముఖాముఖి చర్చ జరిపి, వారి అభిప్రాయాలనుతెలుసుకున్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పరిపాలన విధానం, భవిష్యత్తు ప్రణాళిక, మహిళా సాధికారత, బాలికల భద్రత, బేటి బచావో బేటి పడావో ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు నాగలక్ష్మి, సవిత, మిషన్ శక్తి బృంద సభ్యులు, విద్యార్థినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు