బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం
జె న్ టి యూ హైదరాబాద్ నిన్న విడుదల చేసిన మొదటి సంవత్సర మొదటి సెమిస్టరు పరీక్ష ఫలితాలలో పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఇద్దరు విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ విద్యార్థి మహమ్మద్ ఇర్ఫాన్ షరీఫ్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన విద్యార్థి షేక్ సమీనా 9.75 CGPA తో యూనివర్సిటీ స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచారని, 9.5 CGPA కి పైన 17 మంది, 9.0CGPA కి పైన 63 మంది విద్యార్థులు ఫలితాలు సాధించారు అని చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. అధ్యాపకులచే తయారు చేయబడిన మైక్రో షెడ్యూల్ ఈ ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఎంతో ఉపయోగపడిందని అన్నారు. కళాశాల డైరెక్టర్ శ్రీ మల్లంపాటి శ్రీవిద్య మాట్లాడుతూ ప్రతి సబ్జెక్టుకు తరగతి బోధనతో పాటు,ప్రాక్టికల్స్ పై కూడా సమంతరంగా నిర్వహించడం వలన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో దోహదపడిందని అన్నారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ ఈ ఫలితాలు యూనివర్సిటీ స్థాయిలోనే అత్యుత్తమ ఫలితాలని ఈ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపకులకు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు కృషి, పట్టుదల, సాధన ద్వారానే,సాధ్యమవుతుందని, దానివల్లె ఈ ఫలితాలు సాధించామని తెలిపారు. కళాశాల అకాడమిక్ డీన్ డాక్టర్ సుదర్శన మాట్లాడుతూ సిలబస్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులను ఎప్పటికప్పుడు నిష్టాతులైన నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి,డిప్లొమా ఇంచార్జి కృష్ణ ప్రసాద్ మరియు వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ చిరంజీవి, డాక్టర్ హరిప్రసాద్,శ్రీ కుమార్, పాల్గొన్నారు.

  • Related Posts

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అడెల్లి రోడ్‌లోని వింధ్య యూపీ పాఠశాలలో పేవరెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పద్మనాథ గౌడ్, సాయన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ మనోరంజని ప్రతినిధి భూపాలపల్లి జిల్లా: మార్చి 20 – తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి, ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..!!

    రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..!!

    రాజీవ్ యువ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలి

    రాజీవ్ యువ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలి

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు