

బాధిత కుటుంబానికి మాజీ కేంద్రమంత్రి పరామర్శ
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ కేంద్రమంత్రి వెంట నాయకులు, తదితరులున్నారు