

ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్
ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు
ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రాంచందర్ నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్టేర్ బాలికల డి కళాశాలలో ఏర్పాటు చేసిన యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ హాస్టళ్ళలో చదువుకున్న విద్యార్థులు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. కళాశాల విద్యార్థినీలు సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా వివిధ రకాల ప్రదర్శనల్లో తమ ప్రతిభకు పదును పెట్టారన్నారు. నూతన ప్రయోగాలతో విద్యార్థినీల విజ్ఞానం పెంపొందడంతో పాటు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువ ఉత్సవ్లో భాగంగా కల్చరల్, మొబైల్ ఫోటో గ్యాలరీ, డ్రాయింగ్, పోయట్రి, స్పీచ్, సైన్స్ ఎగ్జిబిషన్(గ్రూప్), సైన్స్ ఎగ్జిబిషన్(ఇండిజ్యూవల్) వంటి 7రకాల పోటీల్లో విద్యార్థినీలు ఉత్తమ ప్రతిభను కనభర్చినట్లు తెలిపారు. ప్రతిభ కనభర్చిన విద్యార్ధినీలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుక్క సుమీల, నెహ్రు యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి ప్రదీప్ సింగ్, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు
ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు
ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రాంచందర్ నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్టేర్ బాలికల డి కళాశాలలో ఏర్పాటు చేసిన యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ హాస్టళ్ళలో చదువుకున్న విద్యార్థులు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. కళాశాల విద్యార్థినీలు సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా వివిధ రకాల ప్రదర్శనల్లో తమ ప్రతిభకు పదును పెట్టారన్నారు. నూతన ప్రయోగాలతో విద్యార్థినీల విజ్ఞానం పెంపొందడంతో పాటు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువ ఉత్సవ్లో భాగంగా కల్చరల్, మొబైల్ ఫోటో గ్యాలరీ, డ్రాయింగ్, పోయట్రి, స్పీచ్, సైన్స్ ఎగ్జిబిషన్(గ్రూప్), సైన్స్ ఎగ్జిబిషన్(ఇండిజ్యూవల్) వంటి 7రకాల పోటీల్లో విద్యార్థినీలు ఉత్తమ ప్రతిభను కనభర్చినట్లు తెలిపారు. ప్రతిభ కనభర్చిన విద్యార్ధినీలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుక్క సుమీల, నెహ్రు యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి ప్రదీప్ సింగ్, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు
