ఛి ఛి….కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక

ఛి ఛి….కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక

మనోరంజని ప్రతినిధి


నాన్న అంటే నడిచే దేవుడిలా భావిస్తారు పిల్లలు.

ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది.

కూతుర్ని ఓ ప్రిన్సెస్‌లా చూసుకునే నాన్నలు మనకు సమాజంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటారు.

ఆకతాయిలు ఏడిపించినా.. చదువులు ఒత్తిడి వేధిస్తున్నా.. ఇలా భరించలేని ఏ సమస్య వచ్చినా నాన్నతోనే షేర్ చేసుకుంటారు కొందరు కుమార్తెలు.

కానీ ఓ తండ్రే కూతురి పాలిట కాలకేయుడయ్యాడు.

కన్నబిడ్డనే చెరిచాడు.

తండ్రి ఆకృత్యం గురించి బయటకు చెప్పలేక.. పంటి బిగునవ బాధను భరిస్తూ తల్లిడిల్లిపోయింది ఆ పాప.

పాఠశాలలో ఆ అమ్మాయి ముభావంగా ఉండటాన్ని గమనించిన టీచర్.. ఏం జరిగిందని అడగ్గా.. జరిగిన దారుణాన్ని చెబుతూ బావురుమంది.

దీంతో టీచర్స్ సాయంతో పాప పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో పోక్సో కేసు నమోదు అయ్యింది.

రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ వ్యక్తి(45) మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 17 ఏళ్ల కిందట మ్యారేజ్ అవ్వగా.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో.. ఎనిమిదేళ్ల కిందట బిడ్డల్ని తీసుకుని భార్య అమ్మగారింటికి వెళ్లిపోయింది. తండ్రికి చేదోడుగా ఉండేందుకు.. పదిహేనేళ్ల పెద్ద కుమార్తె మూడేళ్లుగా అతని వద్దే ఉంటోంది. టౌన్‌లోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదవుతుంది. మంగళవారం స్కూల్‌కు వచ్చిన బాలిక ముభావంగా ఉండడాన్ని టీచర్స్ గమనించారు. బాలికను దగ్గరికి తీసుకుని మాట్లాడితే.. తండ్రి చేస్తోన్న ఆకృత్యాన్ని వివరించి వెక్కి వెక్కి ఏడ్చింది. విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన టీచర్స్.. వారి సహకారంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. కొద్ది నెలల కిందట మద్యం మత్తులో తండ్రి తనపై తొలిసారి లైంగిక దాడి చేశాడని.. నాటి నుంచి నిత్యం అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని పోలీసులకు బాలిక చెప్పింది. దీంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Related Posts

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుం దని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని,…

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు.. హైదరాబాద్: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్‌లో ఉంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..