

ఘనంగా సమతా సైనిక్ దళ్ స్థాపన దినోత్సవం
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో సమతా సైనిక్ దళ్ -మహాడ్ చెరువు సత్యాగ్రహం క్రాంతి దినోత్సవం భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాత్మ జ్యోతిబాపూలే చౌరస్తా నుండి నాగార్జున నగర్ బుద్ధ విహార వరకు సైనికులు కవాతు నిర్వహించారు. అనంతరం గౌతమ బుద్ధుడు -బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప ధూప పూజలు చేశారు. ఈ సందర్భంగా బిఎస్ఐ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సంజయ్ బోధి కస్తూరే మాట్లాడుతూ భారతీయ బౌద్ధ మహాసభ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. గతంలో జిల్లాలో భారతీయ బౌద్ధ మహాసభలో పనిచేసే కార్యకర్తల సంఖ్య చాలా తక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం మహిళలు పురుషులు వేల సంఖ్యలో ఉండడం బాధ్యుల పనితనానికి నిదర్శనం అన్నారు. ఇలాగే కార్యక్రమాలను ఉత్సాహంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. యువత సమతా సైనిక దళ్- మహాడ్ చెరువు సత్యాగ్రహం చరిత్రను విధిగా చదివి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధమహసభ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రభాకర్ గడ్పాలే, కార్య అధ్యక్షులు- ఎస్ఎస్ డి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ వాగ్మారే, ఉపాసకులు అడ్వకేట్ శంకర్ గడ్పలే దేవిదాస్ హాస్డే, గంగాధర్ దగ్డే, గంగాధర్ చందనే, నిజామాబాద్ జిల్లా బిఎస్ఐ అధ్యక్షుడు డిఎల్ మాల, జగిత్యాల జిల్లా బిఎస్ఐ అధ్యక్షులు కే. శంకర్, ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్బారావు వాగ్మారే, జిల్లా కార్యవర్గ సభ్యులు శృంగార గంగాధర్, ఉపాసకులు, ఉపాసికులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
