హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

హైదరాబాద్: హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచీ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక, మహానగరం హైదరాబాద్ విషయానికి వస్తే.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు భిన్న సంస్కృతుల్లో హోలీ జరుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా అక్రమార్కులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. హోలీ వేళ డ్రగ్స్ అమ్మేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. రంగంలోకి దిగిన నగర పోలీసులు అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ లోయర్ దూల్పేట్ మల్చిపురాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా, ఆగ, మగ అంతా కలిసి రంగులు చల్లుకుంటున్నారు. ఇదే అదునుగా గంజాయి విక్రేతలు కొత్త దారులు వెతికారు. ఈ మేరకు కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయి పెట్టి విక్రయాలు ప్రారంభించారు. అయితే డ్రగ్స్ విక్రయంపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి పట్టుకున్నారు. నిందితుడి నుంచి గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్‌నూ సీజ్ చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా నిందితుడు వాటిని తయారు చేసిన విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. కాగా, సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారి అంజిరెడ్డి తెలిపారు. సాధారణ సమయాలు, పండగల వేళ డ్రగ్స్ కొనుగోలు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని అంజిరెడ్టి సూచించారు.

  • Related Posts

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా…

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్(18)కు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)కు మధ్య సామాజిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్