హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

దయనీయంగా మారిన హెల్త్ అసిస్టెంట్ల జీవన పరిస్థితులు

మనోవేదనతో మరణించిన ఏడుగురు హెల్త్ అసిస్టెంట్లు

సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి

మనోరంజని ప్రతినిధి విశాఖపట్నం మార్చి 18 – కోర్టుల్లో కేసుల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నుండి తొలగించిన 920 మంది కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే వీధుల్లోకి తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. వైజాగ్ లో సురేష్ బాబు సంఘ ప్రధాన కార్యదర్శి లింగాల రవీంద్ర బాబుతో కలిసి మాట్లాడుతూ కోర్టులో కేసులు వివాదాలు,విద్యార్హతలు,మెరిట్ లిస్టు సమస్యలతో 22 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది హెల్త్ అసిస్టెంట్లను తొలగించడం వల్ల వారి జీవన పరిస్థితులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన ఉద్యోగులులో చాలామంది 50 సంవత్సరాలు పైగా వయసు కలిగిన వారు ఉన్నారని,వాళ్లంతా పలు రకాల కుటుంబ,ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఉద్యోగాల నుండి తొలగించడంతో మనోవేదనతో ఏడుగురు హెల్త్ అసిస్టెంట్లు మరణించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల నుండి తొలగించి మూడు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు సమస్య పరిష్కారంపై స్పష్టత లేకపోవడం వల్ల హెల్త్ అసిస్టెంట్లు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకొని ,వాళ్లకు మూడు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.సమస్య పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవాలని సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.

  • Related Posts

    తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

    తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 21తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్‌, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐ ఆర్‌ను…

    రాజకీయ లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వంపై సుంకర పద్మశ్రీ విమర్శలు

    రాజకీయ లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వంపై సుంకర పద్మశ్రీ విమర్శలు 9 నెలలు నిద్రపోయి, నేడు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం హోంమంత్రి అనిత , ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారిపై సుంకర పద్మశ్రీ నిరాధార ఆరోపణలు ప్రజా దర్బార్ నిర్వహణలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.