

స్వర్గీయ జాధవ్ సకారం కుటుంబాన్ని పరామర్శంచి శ్రద్ధాంజలి ఘటించిన రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు
ఆ పేద కుటుంబానికి 8000/- వేల రూపాయలు ఆర్థిక భరోసా అందజేత
సామాజిక సేవ కోసమే రెహమాన్ ఫౌండేషన్ : చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని
మనోరంజని ప్రతినిధి లింగాపూర్ :మార్చి 12 :- ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ జాధవ్ సకారం నాయక్ (65) గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.. బుధవారం దశదిన పెద్దకర్మ (తేర్వి) కార్యక్రమంలో రెహమాన్ ఫౌండేషన్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ బృందం సభ్యులు పాల్గొని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో…… ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి సభ్యులు జాటోత్ దవిత్ కుమార్ ద్వారా మృతుని సతీమణి ఝాలిబాయి, పెద్ద కుమారులు జాధవ్ దేవిదాష్, సత్యపాల్ కి 8000/- వేల రూపాయలు నగదును అందిజేశారు. మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే ప్రతి పేద కుటుంబాలకు రెహమాన్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ సంతోష్, జాధవ్ మారుతీ, దవనే విశ్వకాంత్, రాథోడ్ కిషన్, రాథోడ్ ధర్మెందర్, రాథోడ్ నరేందర్ గ్రామ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు.!