శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 29 :- శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాల్సిన ఇంజనీరింగ్‌ కళాశాలను హుస్నాబాద్‌లో నెలకొల్పడం సరైన నిర్ణయం కాదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కరీంనగర్ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్ అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్‌లోనే కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.”హుస్నాబాద్‌లో కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు వసతి, రవాణా సమస్యలు వస్తాయి. కరీంనగర్‌లోనే కళాశాల ఉంటే ప్రభుత్వ హాస్టల్స్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని అన్నారు.అధికారంలో ఉన్నట్లు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సముద్రల ఓంకార్, సయ్యద్ షోహైల్, మడిశెట్టి అజయ కుమార్, నాయిని అన్వేష్, మామిడిపల్లి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 08 :- రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా…

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం. *మనోరంజని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 08 :- మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం సుద్దాల గ్రామములో సీఎం రేవంత్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే వివేక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.