విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపు !

విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపు !

అధికారం ఉంది కదా ప్రతీ దానికి వైఎస్ఆర్ పేరు తగిలించుకున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడు వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకపోయినా వివిధ సంస్థలకు వైఎస్ఆర్ పేరు పెట్టారు. అలాంటి వాటిలో విశాఖలోని అంతర్జాతీయ స్టేడియం ఒకటి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు చెందిన స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరు తొలగిస్తూ ఏసీఏ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనే పేరు ఉండేది. ఇక నుంచి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా ఉంటుంది. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచులు జరగనున్న సమయంలో ఈ మార్పులు చేశారు. వైఎస్ఆర్ కు క్రికెట్ కు సంబంధం లేదు. స్టేడియానికి..వైఎస్‌కు సంబంధం లేదు. కానీ వైఎస్ చనిపోయిన తర్వాత ప్రతీ దానికి వైఎస్ పేరు పెట్టుకుంటూ పోయారు. విశాఖ స్టేడియానికీ అలాగే పేరు వచ్చి చేరింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీఏను కూడా విజయసాయిరెడ్డి లాక్కున్నారు. అప్పట్లో గోకరాజు గంగరాజు అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయనతో పాటు పాలకమండలి మొత్తాన్ని తప్పించి విజయసాయిరెడ్డి ..తన అల్లుడు, అకౌంటెంట్లకు చాన్సిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణల భయంతో రాజీనామా చేశారు. కేశినేని చిన్ని ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మచిలీపట్నంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత… విజయవాడ: వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఠారెత్తాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సగటున 40 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం