

భైంసా మున్సిపాలిటీ పై బిజెపి జెండా ఎగరవేస్తాం
కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో పటేల్ను సన్మానించిన పట్టణ బిజెపి కమిటీ

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 09 :- నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీ పై కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కచ్చితంగా దక్కించుకుంటామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో బిజెపి పట్టణ కమిటీ నాయకులు ఆదివారం అధ్యక్షులు ఎనపోతుల మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ని సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. భైంసా లో మున్సిపాలిటీ పై బిజెపి జెండా ఎగరవేయడం, కార్యకర్తల ఎన్నో సంవత్సరాల కల, అని అందుకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి బిజెపికి మెజార్టీ వచ్చిందని ఈ సందర్భంగా ఓటర్లకు, కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు, కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడిన వారికి బిజెపి పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందన్నారు. బిజెపి పట్టణ ఎ ను పోతుల మల్లేష్ మాట్లాడుతూ తమ నాయకుడు అన్న మాట ప్రకారం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కైవసం చేసుకున్నామని, ఇదే మాట ప్రకారం కష్టపడి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. సన్మాన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు