బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ఏ, బీ, ఈ వర్గాల నేతలు పాల్గొన్నారు.సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను మత ప్రాతిపదికన విభజించడం ద్వారా గందరగోళం సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. కుల గణన ప్రకారం మొత్తం బీసీలు 56% ఉండగా, కేవలం 42% రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని అన్నారు. హిందూ బీసీలకు 46%, ముస్లిం బీసీలకు 10% ఉన్నా, బీసీ ముస్లింలను మినహాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించిన నాయకులు, మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు న్యాయస్థానాల్లో నిలవవని హెచ్చరించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో షేర్ ఆలీ, ఎండి షబ్బీర్, జమీల్, ఎండి దావూద్, అద్నాన్ ఖమార్, శుక్రోద్దీన్, భాషా, ఎండి ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

    మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా