పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

మనోరంజని ప్రతినిధి అమరావతి: మార్చి 18 – పోసాని కృష్ణ మురళి సీఐడీ విచారణ ఈరోజు ముగిసింది. చంద్రబాబు అధికారం కోసం అమిత్‌ షా కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు చేసి దాన్ని మీడియా సమావే శంలో పెట్టి.. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువత నేత వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పోసానిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు… ఆ ఫోటోను ఎవరు తయారు చేశారు.. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది.. పోసానినే ఫోటో తయారు చేసి మీడియా సమావేశం పెట్టారా? లేక మరెవరైనా ఫోటో తయారు చేసి సమావేశం పెట్టమని ఆదేశించారా? అనే కోణంలో కస్టడీలో సీఐడీ అధికారులు పోసానిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత జీజీహెచ్‌లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా జైలుకు తరలించారు అయితే పోసానిని మరోసారి కస్టడీ విచారణకు తీసుకోవాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోసాని బెయిల్ పిటిషన్ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది

  • Related Posts

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి మార్చి 21 :- పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన 25 ఏళ్ల కోరవేన సాయి తేజ బెట్టింగ్ యాప్‌ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాడు. గోదావరిఖనిలోని ఓ…

    గతంలో గొడవ పడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవు..

    గతంలో గొడవ పడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవు.. మనోరంజని ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా:: మార్చి 21 – వేములవాడ దర్గా కు తలం వేస్తున్నట్లు వస్తున్న వీడియో గతంకి సంబంధించినది: వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.