నిర్మల్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్

నిర్మల్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 15 :- నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించింది. శనివారం మేడిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రైవేటు స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రాజెక్టు కింద నిర్మల్ జిల్లాలో 16 పాఠశాలల్లో AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 3 నుండి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా AI ఆధారిత యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌లు విద్యార్థుల అభ్యాస స్థాయిని గుర్తించి వారికి అవసరమైన పాటలను, కథలు, వీడియోలు, ఆటల ద్వారా నేర్చుకునే అవకాశాన్ని అందిస్తాయి.
కలెక్టర్ అభిలాష అభినవ్ ఉపాధ్యాయులకు ప్రతి విద్యార్థి ఆరోగ్య, విద్యా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు, తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజేందర్, విద్యాశాఖ అధికారులు సలోని, ప్రవీణ్, లింబాద్రి, ఉపాధ్యాయులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు

నిర్మల్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత కంప్యూటర్ ల్యాబ్
  • Related Posts

    అబద్దాల బడ్జెట్” ప్రవేశపెట్టిన కాంగ్రెస్: మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు విమర్శ

    అబద్దాల బడ్జెట్” ప్రవేశపెట్టిన కాంగ్రెస్: మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు విమర్శ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 19 :-తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి…

    పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్ధవంతంగా వినియోగించాలి

    పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్ధవంతంగా వినియోగించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశాలు జారీ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 19 :- పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్ధవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

    ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

    భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

    భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగొచ్చింది…!

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగొచ్చింది…!

    రాష్ట్రంలో ఉపఎన్నికలు ⁉*

    రాష్ట్రంలో ఉపఎన్నికలు ⁉*