ధర్పల్లిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 29 – ధర్పల్లి మండల కేంద్రంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సత్య సాయి బాల వికాస్ తల్లిదండ్రుల సమావేశంలో “మహిళా విభాగం వారి పాత్ర” అనే అంశంపై చర్చించారు.ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా బాల వికాస్ ఇన్‌చార్జి డాక్టర్ మంజుల మాట్లాడుతూ, పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి మాటలు చెప్పడం మాత్రమే కాకుండా, వారే స్వయంగా మంచి ప్రవర్తన పాటించాలి. పిల్లలు మాటలు కన్నా, తల్లిదండ్రుల ఆచరణను ఎక్కువగా గ్రహిస్తారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఇన్‌చార్జి పుష్పలత, బాల వికాస్ డిస్టిక్ జాయింట్ కోఆర్డినేటర్ శోభ, యూత్ కోఆర్డినేటర్ వనిత, జాయింట్ కోఆర్డినేటర్ జ్యోతి, సమితి మహిళా కన్వీనర్ కృష్ణవేణి, మంతెన లక్ష్మి, పిండి మమత, సత్యసాయి ప్రతినిధులు చిలుక శంకర్, మచ్చ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    TTDకి రూ. కోటి విరాళం

    TTDకి రూ. కోటి విరాళం మనోరంజని ప్రతినిధి తిరుపతి ఏప్రిల్ 07 – తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు మొత్తం…

    భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

    భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నభద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం భద్రాచలం రామాలయంలో శ్రీ రామ మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరవుతున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏపీలో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం

    ఏపీలో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం

    కడప జిల్లా కోర్టుకు మాజీ మంత్రి సోదరుడు

    కడప జిల్లా కోర్టుకు మాజీ మంత్రి సోదరుడు

    అంధులను కోర్టుల చుట్టూ తిప్పించడంపై హైకోర్టు జడ్జి ఆగ్రహం

    అంధులను కోర్టుల చుట్టూ తిప్పించడంపై హైకోర్టు జడ్జి ఆగ్రహం

    కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు..

    కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు..