ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 04 ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మార్చి 4 నుండి 10 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిరికొండ మండల కేంద్రంలో అధ్యక్షుడు మొట్టల దీపక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్, జిల్లా ఇంచార్జ్ ఇంజం వెంకటస్వామి హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరిగిందని, జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో 11 శాతం రిజర్వేషన్ రావాల్సిందిగా సూచించబడినా, కేవలం 9 శాతానికి పరిమితం చేసారని మండిపడ్డారు. ఈ లోపాలను సవరించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గందమాల నాగభూషణం మాదిగ, జాతీయ మహిళా నాయకురాలు యమున, జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్, ధర్పల్లి మండల ఇంచార్జ్ నక్క రాజేందర్, డప్పు నర్సయ్య, సంగేమ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం