

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 07 :- ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ బలపరిచిన బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం ఒక చారిత్రాత్మక మలుపు అని తపస్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈ గెలుపు జాతీయవాద శక్తులకు ఉత్సాహంగా పనిచేయడానికి స్ఫూర్తిని కలిగిస్తుందని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరింత బలోపేతం అయ్యే దిశలో మార్పు కానుందని జిల్లా నాయకులు పేర్కొన్నారు. సంఖ్యా బలం కన్నా సైద్ధాంతిక బలమే గొప్పది అని ఈ విజయం నిరూపించింది అని పలువురు పేర్కొన్నారు.అనంతరం టపాసులు కాల్చి,మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు నవీన్ కుమార్,సుదర్శన్,జిల్లా నాయకులుజి.రాజేశ్వర్,ముత్యం,అశోక్,వా,దత్తురాం,జైస్వాల్,ఆర్.రాజేశ్వర్,విఠల్,అరుణ్,భూమన్న,సాయికృష్ణ,పండరి,దత్తత్రి ,చక్రపాణి,తదితరులు పాల్గొన్నారు.