ఇక మంత్రి పదవిపై విజయశాంతి దృష్టి !

ఇక మంత్రి పదవిపై విజయశాంతి దృష్టి !

కాంగ్రెస్ వర్గ రాజకీయాల్లో విజయశాంతి అడ్రస్ లేకుండా పోయారని అనుకున్నారు కానీ ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చివరి రోజు సిక్సర్ కొట్టారు. చాలా మంది నేతలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నేరుగా హైకమాండ్ వద్దకు వెళ్లి తన పేరు లిస్టులో వచ్చేలా చేసుకున్నారు. ఆమె రాజకీయానికి మిగతా కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఆమె మంత్రి పదవిపై కన్నేశారు. తనను కేబినెట్ లోకి తీసుకునే అంశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లు పదవుల కోసం ఏడాదిగా హైకమాండ్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకు రావాలో అంతటి ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. అసలు పదవులు భర్తీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. కానీ హైకమాండ్ ఆశీస్సులతో నేరుగా పదవి తెచ్చుకున్న విజయశాంతి .. తనకు కేబినెట్ బెర్త్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇది కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమవుతుందని అనుకోవచ్చు.విజయశాంతి ఒక్కో పార్టీలో రెండేసి సార్లు చేరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తిరిగారు. సొంత పార్టీ కూడా ఆమె ఖాతాలో ఉంది. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద ప్రత్యేకమైన పలుకుబడి ఉందని తాజా పదవుల భర్తీతో స్పష్టమైంది. ఆమె పలుకుబడిని బట్టి చూస్తే మంత్రి పదవి కూడా వచ్చినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ కాంగ్రెస్ ఓన్లీ అని నిట్టూరుస్తున్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్