ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం – తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన లక్ష్మీ నగర్ కాలనీవాసులు

మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం మార్చి 12 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల కోసం చేపట్టినది. ఇండ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక కిందిస్థాయి నాయకులు ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ నగర్ తాండకు చెందిన 17 మంది తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ, మంగళవారం తహసీల్దార్ మోతీరాం కు ఫిర్యాదు అందజేశారు. అలాగే స్థానిక ఎస్సై అశోక్ కుమార్ కు కూడా ఈ విషయాన్ని వివరించారు. డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్, తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. బుధవారం ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. నాయకుల చేతివాటం రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారుల హామీతో లక్ష్మీ నగర్ తాండ వాసులు శాంతించి వెనుదిరిగారు.

  • Related Posts

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు . మనోరంజని ప్రతినిధినిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి