ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం.

ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం.

మనోరంజన్ న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 27 పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి ఇట్టి మోసగాళ్ళ చేతిలో చిక్కుకొని 57,13,332 రూపాయలు మోసపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రాగా డిజి,,షికా గోయల్ ఆదేశాల మేరకు మరియు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. అంబర్ కిషోర్ జా ఐపిఎస్ ఆదేశాల మేరకు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ యం.వెంకటరమణ డి.ఎస్.పి కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినారు.ఇట్టి పరిశోధనలో డి.ఎస్.పి మరియు జె.క్రిష్ణముర్తి ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడుని నపవాడి గ్రామం,రహతా మండలం,ఆహుల్యానగర్ ఓల్డ్ అహ్మద్నగర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రం, నందు పట్టుకొని విచారించగా అతని పేరు శుభం నవనాథ్ షెల్కే,s/o: నవనాథ్ ఏకనాథ్ షెల్కే, వయస్సు: 20 సంవత్సరాలు, వృత్తి: స్టూడెంట్ R/o:నపవాడి గ్రామం,రహతా మండలం,ఆహుల్యానగర్ ఓల్డ్ అహ్మద్నగర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రం, ఇతడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో టెలిగ్రామ్ లో పరిచయమైన ఒక వ్యక్తికి ఇతడి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ పాస్ బుక్ మరియు ఎ.టి.ఎం అతనికి ఇచ్చి ఇట్టి అకౌంట్ ఇచ్చినందుకు గాను నెలకు 5000 రూపాయలు కమిషన్ తీసుకుంటూ ఇలా వచ్చిన డబ్బులను అతని అవసరాలకు జల్సాలకు వాడుకుంటున్నాడు అట్టి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ , యం.వెంకటరమణ డి.ఎస్.పి ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్ మరియు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ , లోన్ యాప్స్ , డిజిటల్ అరెస్ట్ , మల్టీ లెవెల్ మార్కెటింగ్ , క్రిప్టో కరెన్సీ , ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ , ఓటిపి, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ లను నమ్మి మోసపోకూడదు,మరియు సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ఎటువంటి ఆన్లైన్ యాప్ప్స్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు మరియు సైబర్ మోసాలకు గురవకుండా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు

  • Related Posts

    గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి

    గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 10 :- నిర్మల్ జిల్లా భైంసా: మండలంలోని వానల్పాడు గ్రామ సమీపంలో గురువారం గుర్తు తెలియనివానం ఢీకొని రాజు (32) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు.…

    ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం..!!

    ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం..!! అమెరికా అప్పగించిన 26/11 ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం