ఆధ్యాత్మిక సేవలో ఇఫ్తార్ విందు ఓ భాగం : వై. రవీందర్ యాదవ్

ఆధ్యాత్మిక సేవలో ఇఫ్తార్ విందు ఓ భాగం : వై. రవీందర్ యాదవ్

షాద్ నగర్ చౌరస్తా మజీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వై. రవీందర్ యాదవ్

బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం పట్ల హార్షం

హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన రంజాన్ ఉపవాసాలను పురస్కరించుకొని, మతాలకతీతంగా ఇఫ్తార్ వింధు లను ఏర్పాటు చేయడం సామాజిక సేవలు ఒక భాగమని బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ అభిప్రాయపడ్డారు. బుధవారం షాద్ నగర్ చౌరస్తాలోని మజీద్ వద్ద చిల్కమర్రి మాజీ సర్పంచ్ పల్లె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి అంటేనే మత సామరస్యాలకు ప్రతిక అని, ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ వింధు లను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అల్లా దయవల్ల అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతు లతో ఉండాలని, ముఖ్యంగా రైతులు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ సర్పంచులు మోబిన్ ఘోరీ, అశోక్, మచ్చేందర్, రంగయ్య గౌడ్, చందు నాయక్, చంద్రశేఖర్, రంగయ్య, సాయి యాదవ్, మాజీ కౌన్సిలర్లు చింటూ, వెంకట్రాంరెడ్డి, జూపల్లి శంకర్, నాయకులు వీరేశం గుప్తా, నక్కల వెంకటేష్ గౌడ్, రఘుపతి రెడ్డి, మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), బిలాల్, పర్వేజ్, అజహార్, సాధక్, చిలకమర్రి ఆనంద్, మహబూబ్, రహమత్ అలీ, అబ్బాస్, మినాజ్ తదితరులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్