ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి చొరవ తీసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి చొరవ తీసుకోవాలి
ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్


మనోరంజని ప్రతినిధి మార్చి 05 ఆదిలాబాద్ :- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల విమానాశ్రయ స్థలంలో విమానాశ్రయ నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే చొరవ తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర జిల్లాలలో తగిన సౌకర్యాలు లేకున్నప్పటికి అక్కడి ప్రజా ప్రతినిధుల చొరవతో విమానాశ్రయాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని కాని ఇక్కడి ప్రజాప్రతినిధులు మాత్రం విమానాశ్రయ నిర్మాణం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. విమానాశ్రయ నిర్మాణానికి అన్ని అర్హతలున్నప్పటికి ప్రజా ప్రతినిధుల పట్టింపు లేకపోవటం వలన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల కల కలగానే మిగిలిపోతుందని అని ఆయన అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణం వలన రవాణా సౌకర్యాలు మెరుగుపడి వాణిజ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగ కరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం విమానాశ్రయ నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు వెంటనే చొరవ తీసుకుని పనులు ప్రారంభించే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఎడల అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని దశల వారీ ఉద్యమాలకు పూను కుంటామని ఆయన తెలిపినారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్