అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి మొదలుకానున్నాయి..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి మొదలుకానున్నాయి..

2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​తో పాటు కీలక బిల్లు లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకోనున్నారు. ఈ నెల 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి.. గవర్నర్​ ప్రసంగం ఉంటుంది. గవర్నర్​ ప్రసంగంపై మరుసటిరోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14న హోలీ కావడంతో సభ జరగదు. ఒకవేళ ధన్యవాద తీర్మానం చర్చ కౌన్సిల్​లో పూర్తికాకపోతే 15న కూడా దానిపై చర్చించే చాన్స్​ ఉంది. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై, 18న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారని సమాచారం. ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత పద్దులపై చర్చించనున్నారు. నెలఖారు వరకు బడ్జెట్​ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం. ఒకవేళ రాష్ట్ర బడ్జెట్​ను 17న పెడితే.. చివరలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెట్టే అవకాశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో చర్చించిన తరువాత సభ నిర్వహించే రోజులపై పూర్తి క్లారిటీ రానుంది.

బీసీ, ఎస్సీ ఎజెండాతో ప్రభుత్వం..ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు
బడ్జెట్​ సమావేశాలు ఈసారి గరం గరంగా సాగనున్నట్లు తెలుస్తున్నది. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్​ కూడా సభకు హాజరవుతానని సంకేతాలు పంపించారు. దీంతో మొత్తం బడ్జెట్​ సమావేశాలు పూర్తయ్యే వరకు రోజూ ఆయన వస్తారా లేక ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తారా? అనేదానిపై క్లారిటీ లేదు. ప్రతిష్టాత్మకమైన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సభలో వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం గత ప్రభుత్వం పదేండ్లలో బీసీలు, ఎస్సీలకు ఏం చేసిందనే దానిపై బీఆర్​ఎస్​ను ఎండగట్టనుంది. దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు తగిన విధంగా రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీని కార్నర్​ చేయనుంది. సాగు, తాగునీటితో పాటు రుణమాఫీ, రైతు భరోసా, గురుకులాలు, గ్యారంటీల అమలుపై అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

  • Related Posts

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 15 :- భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో సంస్కార్ స్కూల్ డే మరియు పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్…

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్ మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15 ఏస్ ఎస్ కే క్షత్రియ సమాజ్ (పట్కరి) షాపూర్ నగర్ లో పిల్లలకు ఉపనయనం (ముంజు బంధంన్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి షాపూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం