అదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ అఖిల్ మహాజన్

అదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ అఖిల్ మహాజన్

పోలీసులను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి..

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 10 :- నూతన ఆలోచనలు, పద్ధతులతో పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఐపీఎస్ ల బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయన సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు.ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రస్తుత కరీంనగర్ సిపి గౌస్ ఆలం వద్ద నుండి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున సరిహద్దు పై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ ఆక్టివిటీస్ లేకుండా నేరాలను నియంత్రించడం, శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయం అని తెలిపారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్