శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 29 :- శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాల్సిన ఇంజనీరింగ్‌ కళాశాలను హుస్నాబాద్‌లో నెలకొల్పడం సరైన నిర్ణయం కాదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కరీంనగర్ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్ అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్‌లోనే కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.”హుస్నాబాద్‌లో కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు వసతి, రవాణా సమస్యలు వస్తాయి. కరీంనగర్‌లోనే కళాశాల ఉంటే ప్రభుత్వ హాస్టల్స్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని అన్నారు.అధికారంలో ఉన్నట్లు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సముద్రల ఓంకార్, సయ్యద్ షోహైల్, మడిశెట్టి అజయ కుమార్, నాయిని అన్వేష్, మామిడిపల్లి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే