

విద్యార్థి దశ నుండే పిల్లలలో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి
లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్
మనోరంజని ప్రతినిది నిర్మల్ మార్చి 06 :- విద్యార్థి దశనుండే పిల్లలకు ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ తెలిపారు. జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలశక్తి కార్యక్రమంలో భాగంగా కేజీబీవీ దస్తురాబాద్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత సైబర్ సెక్యూరిటీ పై క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులకు డబ్బు విషయంపై పొదుపు,పెట్టుబడి,బాధ్యత,దుబారా ఖర్చులు చేయకుండా ముందటి నుండే అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.అదేవిధంగా చిన్నప్పటినుండి పిల్లలకు డబ్బుపై అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి,ఉపాధ్యాయులు,సి ఎఫ్ ఎల్ వాలంటీర్ ప్రశాంత్,పాఠశాల విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు