రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మనోరంజని ప్రతినిధి

హైదరాబాద్:మార్చి 07
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తం గా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం.ప్రతి మగవాడి విజయం వెనక ఒక తల్లి, భార్య,చెల్లి అక్క కూతురు,ఇలా ఒక స్త్రీ మూర్తి ఉండే ఉంటారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరు మహి ళలకు సహ కరించాలి,

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల చేయనున్నారు.

ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్త్ కర్తవ్యా లను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ – 2025.. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐకమ త్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు రానున్నాయి.

స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృత పరిచేలా సభ్యుల అర్హత వయసు పెంచనున్నారు. కిశోర బాలికలు, వయో వృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నారు.

సభ్యుల కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపుతో పాటు గరిష్ట వయసు 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంపుదల చేశారు..

*మహిళా సంఘాలకు రూ. 21,632 కోట్ల రుణాలు

*2,25,110 సూక్ష్మ, మధ్య తరహా సంస్థల ఏర్పాటు

*రూ. 110 కోట్లతో 22 జిల్లాల్లో చురుకుగా ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం

*రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు

*గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ తో అనుసంధానించడం కోసం మాదాపూర్ లోనీ శిల్పారామంలో రూ. 9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం

*మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించడం ద్వారా రూ. 30 కోట్ల ఆదాయం

*ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు.

*అమ్మ ఆదర్శ పాఠశాలల
ఆధ్వర్యంలో ఇప్పటికే రూ. 634 కోట్ల విలువగల 23,701 పనులు

*మహిళా సంఘ సభ్యులకు రెండు లక్షల రుణ బీమా, 10 లక్షల ప్రమాద బీమా

*400 మందికి రూ. 40 కోట్ల ప్రమాద బీమా చెల్లింపు

*32 జిల్లాల్లో అందుబాటులోకి 32 మొబైల్ ఫిష్ రిటైల్ ట్రక్కులు, ప్రతి ట్రక్కుపై ఆరు లక్షల సబ్సిడీ

*మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కి ఏర్పాట్లు

మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టిసి అద్దె బస్సుల నిర్వహణ.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్