రాజ్యాంగ నిర్మాతకు అవమానం

రాజ్యాంగ నిర్మాతకు అవమానం

మనోరంజని ప్రతినిధి గోదావరి జిల్లా: మార్చి 23 – తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుత్తి తెలియని వ్యక్తులు చెప్పుల దండలు వేయడం ఉదృత తకు దారితీసింది, ఆదివారం ఉదయం విగ్రహానికి చెప్పుల దండ ఉండటం చూసి అంబేద్కర్ అభిమానులు, మాల మహానాడు సభ్యులు రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. స్థానికులు మండలంలోని అంబేడ్కర్‌వాదులు, మాల మహానాడు నేతలకు సమాచారం తెలపడంతో వారు భారీ ఎత్తున తరలి వచ్చి రాస్తారోకో నిర్వహిం చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్ప డ్డాయి. విషయం తెలుసు కున్న ఆదనపు ఎస్పీ సుబ్బారాజు, కొవ్వూ రు డీఎస్పీ దేవకుమార్‌ సిబ్బందితో హూటహూటిన చేరుకుని క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంఘటనా స్థలానికి వచ్చి అంబేడ్కర్‌ను అవమాన పరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. రాస్తారోకో చేస్తున్న వారితో కలిసి రోడ్డు పై కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ విషయంపై మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహాన్ని చెప్పుల దండతో అవమానపర్చారని, అక్కడ నూతన విగ్రహాం ఏర్పాటు చేసి పైన షెల్టర్‌ నిర్మించాల ని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామ న్నారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రం అందించారు. గోపాల పురం జనసేన కన్వీనర్‌ దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించి శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. డీఎస్పీ, సీసీఎస్‌ సీఐ అనుకూరి శ్రీనివాస్‌, దేవరపల్లి సీఐ బియస్‌ నాయక్‌, నల్లజర్ల సీఐ విజయశంఖర్‌ అంబేడ్క ర్‌వాదులతో చర్చలు జరిపి అంబేడ్కర్‌ విగ్రహానికి పాలా భిషేకం చేసి పూలమాలలు వేశారు

  • Related Posts

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు. మనోరంజని , మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 29 – మంచిర్యాల జిల్లా, భీమారం మండలం కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను ఘనంగా…

    కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు

    ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు మనోరంజని ప్రతినిధి కరీంనగర్,మార్చి,29 :- ఏప్రిల్ 12వ తేదీన నగరంలోవీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

    కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు

    కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు

    శేర్లింగంపల్లి లో రంజాన్ సందర్భంగా తోఫాను అందజేసిన డా. రవీందర్ యాదవ్.

    శేర్లింగంపల్లి లో రంజాన్ సందర్భంగా తోఫాను అందజేసిన డా. రవీందర్ యాదవ్.

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి