

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 15 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడ గ్రామ మాజీ సర్పంచ్ సాయ్ గౌడ్ ఇటీవల మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాన్ని శనివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పరామర్శించారు. మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పిటిసి లక్ష్మీనర్సాగౌడ్, మాజీ సర్పంచ్ శ్వేత రవి కిరణ్ గౌడ్, నాయకులు, తదితరులు ఉన్నారు