


అమరావతి: శాసనసభ్యుల కోటానుంచి టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టిడిపి సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేష్ ను కలిశారు. ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా రవిచంద్రకు లోకేష్ అభినందనలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు.