బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 : హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ నేతలు దళితులపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.ప్రధానంగా కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి, ఆరోపణలు వచ్చినట్టు చెప్పి పదవి నుంచి తొలగించారని అన్నారు. జగదీష్ రెడ్డి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ను అమర్యాదగా సంబోధించడాన్ని ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కేటీఆర్ ఆయనకు మద్దతు తెలపడం విడ్డూరమన్నారు. దళితుల పట్ల నిర్లక్ష్య ధోరణి బీఆర్‌ఎస్‌కు పుట్టుకతోనే ఉందని విమర్శించారు. ఇలాంటి నిరసనలు ప్రజలకు కనపడతాయని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్