ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్రావు, శ్రవణ్ రావు ఎక్కడంటే❓

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్రావు, శ్రవణ్ రావు ఎక్కడంటే❓

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రావణ్ రావు కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు సమాచారం.
తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్ పోల్ ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.
అనంతరం స్పందించిన ఇంటర్ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్ రావు కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నం లో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు.

  • Related Posts

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి మనోరంజని ప్రతినిధి మార్చి 16 – అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇటీవల కార్చిచ్చు చెలరేగి భారీ నష్టం మిగల్చగా తాజాగా టోర్నడోలు, తుఫాన్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాయి. తుఫాను ధాటికి 34…

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 16 – ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్‌లో హతమయ్యాడు.ఈ ఘటన శనివారం రాత్రి 8 గంటలకు అబూ ఖతల్‌ను ఉరితీశారు. అతను భారత్ లో దాడులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి