

ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన చేసారు.. ముందుగా కాముని దహనం చేసేటప్పుడు అందరూ జాగ్రత్తగా వహించాలి.-హోళి* పండగ సంప్రదాయ రంగులు ఉపయోగం ఆరోగ్యకరం.-ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు.మహిళల పట్ల మర్యాదగా ఉండాలని సూచించారు.ముందుగా జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ..ముఖ్యంగా యువత ఆదర్శంగా ఉండాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్ళవద్దు, ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలి అన్నారు. యువత వాహనాలను విచ్చలవిడిగా వేగంగా నడపవద్దు అని కోరినారు. నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని విజ్ఞప్తి చేసినారు.