ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 20 :- తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ పేర్కొన్నారు. గురువారం ఖానాపూర్‌లో మాట్లాడిన ఆయన, బీఆర్‌ఎస్-బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పథకాల పట్ల ప్రజల్లో అపోహలు కలిగించేందుకు నిరంతరంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే పథకాలు అర్హులందరికీ దశలవారీగా అమలు అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ప్రజలు ఏ విధమైన భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.ఖానాపూర్ నియోజకవర్గంలో వెనుకబడిన గిరిజన, ఆదివాసి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ ప్రాంత ప్రజలకు పథకాలు అందించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆత్రం రాజేశ్వర్, ఆత్రం వసంతరావు, ఊర్వేత ఆనందరావు, జాదవ్ రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!!

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!! ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరుకొత్త కార్డుల జారీలో గందరగోళంహైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటికీ…

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 24 – కరీంనగర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల