ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి

త్వరలో మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు

కాలినడకన మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై ఆరా

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మనోరంజన రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.కొత్తూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో అభివృద్ధిపై కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 2 ,3, 8 ,9,10 ,11,12 వార్డుల్లో సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించి చేయాల్సిన పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అసంపూర్తిగా ఉన్న సిసి రోడ్లు,డ్రైనేజీ పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.అలాగే వేసవికాలం దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ నీటి సరఫరా లో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అలాగే స్టేషన్ తిమ్మాపూర్ లో అంగన్వాడికి మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇచ్చారు.అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతోపాటు కొత్తూరు మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణం లేదని యువకులు తమకు వినతిపత్రం ఇచ్చారని త్వరలోనే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ,ఏఈ నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి,నాయకులు వీరమొని దేవేందర్,కరోల్ల సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శివశంకర్ గౌడ్,ఎమ్మెస్ సత్తయ్య,మాజీ సర్పంచులు జగన్,ఏనుగు జనార్దన్ రెడ్డి,దేవేందర్ గౌడ్,మాజీ ఎంపీటీసీలు కుమారస్వామి గౌడ్,కోమ్ము కృష్ణ,తుప్పర బాలరాజ్,పాశం కృష్ణ,నరసింహ,జగన్, హస్సన్,యువకులు,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష