ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై కొనసాగుతున్న వివాదం.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విమర్శలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై కొనసాగుతున్న వివాదం.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా ఆడటం అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లకు నచ్చడం లేదు. దీంతో, ఐసీసీపై వారందరూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వచ్చి చేరారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల షెడ్యూలింగ్ తలవంపులు తెచ్చేదిగా హాస్యాస్పందంగా ఉందని డేవిడ్ లాయిడ్ విమర్శలు గుప్పించారు. ‘ఇది నిజంగా నాన్సెన్స్. అసలు ఈ పరిణామాల్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఓ ప్రపంచస్థాయి కార్యక్రమం. టీమ్‌లు ఒక చోట నుంచి మరోచోటకు ప్రయాణిస్తుంటాయి. ఒక్కోసారి వెళ్లిన ప్రాంతానికి వెళతామో లేదో కూడా స్పష్టత ఉండదు. వాస్తవానికి నేను హాస్యప్రియుణ్ణే. అయితే, ఓ ప్లేయర్ మాత్రం ఇదేమంత లైట్ తీసుకునే విషయం కాదు’’ అంటూ విమర్శలు ఎక్కువపెట్టారు. ప్రస్తుత టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తుండగా భారత్ తప్ప టోర్నీలో పాల్గొనే ఇతర దేశాలు పాక్, దుబాయ్ మధ్య చక్కెర్లు కొడుతున్నాయి. టీమిండియాను పాక్‌కు పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో, భారత్ మ్యాచులన్నీ దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా జరిగాయి. దీంతో, స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది భారత్‌కు ఉపకరిస్తుందని అనేక మంది క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అన్యాయంగా భారత్‌కు లాభం చేకూర్చే పరిణామని విమర్శించారు. ఫైనల్స్ సమీపిస్తున్న తరుణంలో విమర్శలు జడి మరింత పెరిగింది. ఇక దక్షిణాఫ్రికాపై భారీ విజయంతో న్యూజిలాండ్ టోర్నీ ఫైనల్స్‌కు చేరుకుంది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ అజేయ సెంచరీలతో న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేరుకోలేక దక్షిణాఫ్రికా ఓటమి చవి చూసింది. డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసినా దక్షిణాఫ్రికాకు నిరుపయోగంగా మారింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో దక్షిణాప్రికాకు ఇది వరుసగా ఐదో ఓటమి, 2000, 2002, 2006, 2013 టోర్నీల్లో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది

  • Related Posts

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన మనోరంజని ప్రతినిధి మార్చి 16 – పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. పద్మ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. పద్మ అవార్డులకు…

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- క్రీడలు మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం