కుల్దీప్‌ను మళ్లీ తిట్టిన కోహ్లీ.. మ్యాచ్ అయ్యాక కూడా..

కుల్దీప్‌ను మళ్లీ తిట్టిన కోహ్లీ.. మ్యాచ్ అయ్యాక కూడా..

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి కల నెరవేర్చుకున్నాడు. ఐసీసీ ట్రోఫీ విన్నింగ్ టీమ్‌లో భాగమవ్వాలని అనుకున్న చైనామన్ బౌలర్.. ఏడాది గ్యాప్‌లో తన డ్రీమ్‌ను రెండోసారి నిజం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 గెలిచిన భారత జట్టులో భాగమైన కుల్దీప్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025ని కైవసం చేసుకున్న టీమిండియా తుదిజట్టులోనూ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇంత చేసినా అతడికి తిట్లు మాత్రం తప్పడం లేదు. అసలు కుల్దీప్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి అనేది ఇప్పుడు చూద్దాం..

త్రో అందుకోలేక..

చాంపియన్స్ ట్రోఫీ-2025లో కుల్దీప్ పెద్దగా రాణించలేదు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకొని టీమ్‌కు భారమయ్యాడు. అయినా అతడి టాలెంట్‌, అనుభవంపై నమ్మకం ఉంచిన రోహిత్.. కివీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆడించాడు. కసి మీదున్న కుల్దీప్.. టైటిల్ ఫైట్‌లో 2 కీలక వికెట్లతో చెలరేగాడు. అయితే ఎప్పటిలాగే ఫీల్డింగ్ మిస్టేక్స్‌తో మళ్లీ హిట్‌మ్యాన్‌కు దొరికిపోయాడు. తన బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ వేసిన త్రోను అందుకోలేక తిట్లు తిన్నాడు.

ఆ మాత్రం తెలియదా..

కుల్దీప్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ ఆఫ్ సైడ్ కొట్టిన బంతిని కోహ్లీ వెంటనే అందుకున్నాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌కు విసిరాడు కింగ్. కానీ వికెట్లకు దూరంగా ఉన్న కుల్దీప్.. బంతిని అందుకోకుండా దూరం నుంచి చూస్తూ ఉండిపోయాడు. అతడు గనుక స్టంప్స్ దగ్గరకు వచ్చి బాల్‌ను పిక్ చేసుకొని కొట్టేసి ఉంటే లాథమ్ రనౌట్ అయ్యేవాడు. కానీ కుల్దీప్ నిర్లక్ష్యంతో బతికిపోయాడు. ఇది చూసిన రోహిత్, కోహ్లీ సీరియస్ అయ్యారు.

ఎందుకు పట్టుకోలేదు..

బంతిని ఎందుకు పట్టుకోలేదంటూ కుల్దీప్‌ వైపు చూస్తూ విరాట్ ఏదో అన్నాడు. ఆ వీడియో చూస్తే బూతులు తిడుతున్నట్లే ఉందని నెటిజన్స్ అంటున్నారు. కుల్దీప్ తప్పిదం చూసిన గంభీర్ కూడా అలా మిస్ అయ్యిందేంటి అనేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. రోహిత్ అయితే ఏం చెప్పాలో తెలియక తల మీద చేతులు పెట్టుకొని సైలెంట్ అయిపోయాడు. కాగా, సెమీస్‌లో ఆసీస్‌తో మ్యాచ్‌లోనూ కుల్దీప్ ఇలాగే బంతిని అందుకోకుండా దూరం నుంచి తమాషా చూడటంతో రోహిత్-కోహ్లీ ఇద్దరూ బూతుల దండకం అందుకున్నారు. ఇకపోతే, మ్యాచ్ టైమ్‌లో తిట్టుకున్నా కప్పు గెలిచాక కుల్దీప్‌ను రోహిత్-విరాట్ హగ్ చేసుకున్నారు. అతడితో కలసి సంబురాలు చేసుకున్నారు.

  • Related Posts

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్ మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : వ్యవసాయ రసాయనాల సంస్థ ఎన్ఎసీఎల్ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటా అగ్రి సొల్యూషన్స్ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ చేతికి వెళ్లనుంది. ఎన్ఎసీఎల్లో 53.13% వాటాకు సమానమైన 10,68,96,146 ఈక్విటీ…

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కాంట్రాక్టు ప్రాదిపదికన 1,194 కంకరెంట్ ఆడిటర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 15 మార్చి 2025 వరకు ఆన్‌లైన్‌లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి